Monday, October 1, 2012

నిను పాడ మనసాయెనయ్యా...
సువర్ణ కుసుమాల౦టి కీర్తనల ...లలిత కోమల శ్రావ్య గళాల....
నిను నుతియించిన ధన్యులెందరో.....
ఆ సుమధుర గీతాంజలిని విని..
శృతిలయలులేని..రాగమసలు తెలియని...
భావము పలుకలేని..ఆర్తి ఒక్కటే ఆధారమైన...

నా పాట..నీకు రుచించునో లేదో...అయినా
కరుణించి ..కానిమ్మని ..నీ పద ..కీర్తనా సుమపారిజాతాలరాశిలో...
ఓ చివరనుంచవయ్యా....కొంత సుగంధమ్మలదుకొని తరించునేమో...?

No comments:

Post a Comment